నిజంనిప్పులాంటిది

Feb 27 2024, 12:05

Narendra Modi: నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు..

ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా విడుదల చేస్తారు. 21,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.

ఈ నేపథ్యంలో మొదట కేరళ(Kerala)లోని తిరువనంతపురం(thiruvananthapuram)లోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని ఈరోజు ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన మూడు కీలకమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రధాని ప్రారంభించనున్నారు. దేశ అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు సాంకేతిక, పరిశోధన, అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ఆ తర్వాత తమిళనాడు(tamilnadu)లోని మధురైలో MSME పారిశ్రామికవేత్తల కోసం ఫ్యూచర్ ఆటోమోటివ్ డిజిటల్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. నెక్ట్స్ మహారాష్ట్ర(maharashtra)లోని 5.5 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (SHG) రూ. 825 కోట్లు అందించనున్న ప్రధాని రివాల్వింగ్ ఫండ్ పంపిణీ చేస్తారు. దీంతోపాటు మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. OBC కేటగిరీ లబ్ధిదారుల కోసం మోదీ ఆవాస్ యోజనను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి ఇక్కడ 1300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు..

నిజంనిప్పులాంటిది

Feb 27 2024, 12:03

Rajya Sabha elections: నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది..

సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. 15 స్థానాల్లో హోరాహోరీ పోటీ జరగనుండగా..మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాల కంటే ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు..

ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఓటింగ్(voting) జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 3 మంది ఉన్నారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు..

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 14:18

నేడు హన్మకొండకి తరలిస్తున్న మేడారం హుండీలు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జారత దిగ్విజయంగా ముగిసింది.

దీంతో అధికా రులు నేడు మేడారం నుంచి హుండీ లను హన్మకొండకి తరలిం చనున్నారు.

హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 29 నుంచి హుండీ లను లెక్కించనున్నారు.

మేడారం జారతలో మొత్తం 512 హుండీలను అధికా రులు ఏర్పాట్లు చేశారు. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది.

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 12:39

మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత కీలక భేటీ

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులు పంపించింది.

ఈ మేర‌కు ఇవాళ ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, ఆమెను నిందితు రాలిగా మారుస్తూ సీబీఐ తాజగా నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కవిత తాను హాజ‌రుకాలేన‌ని సీబీఐకి లేఖ రాశారు. ఇదిలా ఉండ‌గా సీబీఐ నోటీసుల నేపథ్యంతో కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత… కేసీఆర్ తో ఈ అంశంపై చర్చిస్తున్నారు.

సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసు లను ఉపసంహరించు కోవాలని లేఖలో కవిత కోరారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు విరుద్ధంగా ఈ నోటీసులు ఉన్నాయని ఆమె చెప్పారు.

సీబీఐకి ఏవైనా సమాధా నాలు కావాలంటే… తాను వర్చువల్ పద్ధతితో విచా రణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణం లో… తనకు ప్రచార బాధ్యతలు ఉన్నాయని చెప్పారు.

ఈ కారణంగా తాను ఢిల్లీకి విచారణకు రాలేనని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో, తనకు జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించాలని కోరారు...

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 12:38

పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తా:కే ఏ,పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధ్యక్షుడు పవ న్‌కల్యాణ్‌ టీడీపీ నుంచి బయటకు రావాలని సూచించారు.

పవన్ బీసీలు... కాపులపైన అభిమానం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరారన్నారు.

72 సీట్లిచ్చి జనసేనను గెలిపించుకుని పవన్ ను సీఎం చేస్తానన్నారు. కాపులు.. జనసేన, టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నా రన్న పాల్.. దేశంలో ప్రధాని మోడీ మతతత్వం పెంచుతున్నారని విమర్శించారు.

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 12:35

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది.

మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతరపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించు కుని.. మొక్కులు సమర్పిం చుకున్నారని తెలిపారు.

బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకు న్నారన్నారు.మేడారం జన జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసిన ఆర్టీసీ కుటుంబానికి అభినంద నలు తెలిపారు.

అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపా యాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు తీసు కున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్‌ను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలు చేశారన్నారు.

ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి.. ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరి చారన్నారు.లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్ట మైన పనిని సమష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారన్నారు.

ప్రయాణ సమయంలో భక్తులు ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించా రని.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరి స్తున్నామని, ప్రోత్సహిస్తు న్నామని మరోసారి నిరూపించారంటూ కొనియాడారు.

మేడారం మహాజాతరలో ఆర్టీసీ సేవలను వినియో గించుకుని, సిబ్బందికి సహకరించిన భక్తులందరికీ ప్రత్యేక సజ్జనార్‌ కృతజ్ఞ తలు తెలిపారు...

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 12:31

ఎల్లుండే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి.

రాష్ట్రంలో సుమారు 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అధికారులు 1,521 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగు తాయి. మార్చి 19తో పరీక్షలు ముగియను న్నాయి.

https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 12:30

తొమ్మిదో తరగతి బాలికపై పీఈటీ ఉపాధ్యాయుడు అత్యాచారం

విశాఖ జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పీఈటీ మాస్టర్ అత్యాచారం చేశాడు.

మధురవాడకు చెందిన మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో బాలికపై పీఈటీ దుర్గాప్రసాద్ కళ్లు పడ్డాయి. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి తెలిసింది.

బెదిరింపులకు పాల్పడ టంతో బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 12:29

కాకినాడ జిల్లాలో లారీ ఆర్టిసి బస్సు ఢీకొని నలుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కన నిలిపి వేసి మరమ్మతులు చేస్తున్నారు.

విశాఖ పట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది పైకి దూసుకెళ్ల డంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 26 2024, 11:40

తెలంగాణలో నేడు గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటన

ఇవాళ తెలంగాణలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యటించానున్నారు. విజయ సంకల్ప యాత్రల్లో పాల్గొంటారు

కాగా, ఇవాళ రాత్రి సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ఉదయం నుంచి సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, ముషీ రాబాద్ చౌరస్తా, బైబిల్ హౌస్, హిల్ స్ట్రీట్, షోలాపూర్ స్వీట్ షాప్,

మహంకాళి స్ట్రీట్, సన్ షైన్ హాస్పిటల్, పీజీ రోడ్. పాటిగడ్డ, బేగంపేట్ రైల్వే స్టేషన్, అమీర్ పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగోకుల్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.

అలాగే, ఇవాళ మధ్యాహ్నం జుబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని మోతీనగర్, జనప్రియ గ్రౌండ్, అంబేద్కర్ విగ్రహం, రాజీవ్ నగర్, యూసుఫ్ గూడా చెక్ పోస్ట్, శ్రీకృష్ణా నగర్, ఇందిరానగర్ లో జరిగే రోడ్ షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.